Home అంతర్జాతీయ వార్తలు అంతరిక్షంలోకి.. మన తెలుగోడు

అంతరిక్షంలోకి.. మన తెలుగోడు

మన తెలుగోడు అసాధ్యుడనిపించాడు. రాకెట్‌ అంటే ఏమాత్రం భయం లేకుండా, రివ్వుమంటూ అంతరిక్షంలో చక్కర్లు కొట్టివచ్చాడు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తొలి భారత పర్యాటకునిగా రికార్డు సృష్టించాడు. ఆయన మరెవరో కాదు.. విజయవాడకి చెందిన తోటకూర గోపి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అమెజాన్‌ వ్యవస్థా పకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్‌`25 వ్యోమనౌకలో గోపీ ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తిచేయడం తెలుగువారికి గర్వ కారణం. గోపి అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన స్వస్థలం విజయవాడ. ఎంబ్రీ రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్శిటీ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో బీఎస్సీ పూర్తిచేసి, ప్రస్తుతం అట్లాంటాలోని ‘ప్రిజర్వ్‌ లైఫ్‌’ సంస్థకు సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు. పైలట్‌గా కూడా శిక్షణ పొందాడు. ఏదేమైన్పటికీ, గోపి రోదసియాత్ర తెలుగు ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here